వైసీపీ మళ్లీ అధికారంలోకి రాదు: పవన్ కళ్యాణ్

Update: 2023-08-07 04:21 GMT

ఏపీలో ప్రభుత్వం మారబోతోంది.. వైసీపీ  మళ్లీ అధికారంలోకి రాదన్నారు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌. అభివృద్ధి పేరుతో అన్యాయంగా భూములు లాక్కుంటున్నారని మండిపడ్డారు. తరతరాలుగా వ్యవసాయం చేస్తున్నవారు ఎక్కడికి పోవాలని పవన్‌ ప్రశ్నించారు. మల్లవల్లి పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులతో ఆయన సమావేశం అయ్యారు. రైతుల పక్షాన జనసేన బలంగా నిలబడుతుందన్నారు. హక్కులను అడగకపోతే.. బలమున్న ప్రతి ఒక్కడు అన్యాయమే చేస్తాడని అన్నారు. పారిశ్రామిక వాడ నిర్వాసిత రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  

Tags:    

Similar News