తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి బాధ్యతల స్వీకరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 21న ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 21న బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర సభ ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక బీజేపీ అధ్యక్షుల్లో ఎవరికీ దక్కని అరుదైన ఘనత కిషన్రెడ్డి సొంతమైంది. నాలుగుసార్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన రికార్డ్ సృష్టించారు.