జగన్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. విశాఖలో వామపక్షాలు రోడ్డెక్కాయి. విభజన హామీల విషయంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేసిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వామపక్ష నేతలు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, విశాఖ మెట్రో రైల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా అమలు కాకపోవడంపై మండిపడుతున్నారు.