మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పేదల గుడిసెలను తొలగించడం ఉద్రిక్తతకు దారి తీసింది. మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ భూమిలో పేదలు గుడిసెలు వేసుకున్నారు. రంగంలోకి దిగిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులు… పోలీసుల సహాయంతో గుడిసెల్ని తొలగించారు. గుడిసెల్ని తొలగించడంతో ఆందోళనకు దిగారు. తమకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.