శాసనసభలో ఎమ్మెల్యే శ్రీధర్బాబు మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం నడిచింది.వరదలు, పంట నష్టంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన శ్రీధర్బాబురైతులను పట్టించుకోరా అంటూ..మంత్రి కేటీఆర్ను ప్రశ్నించారు. అయితే శ్రీధర్బాబు ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు కేటీఆర్.రైతుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని 3 గంటలే కరెంటు చాలన్న వాళ్లా మమ్మల్ని ప్రశ్నించేది అంటూ ఘాటుగా స్పందించారు.కాంగ్రెస్ నీతులు చెబితే వినే పరిస్థితుల్లో లేమని,రైతుల విషయంలో అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. వరదల విషయంలో బట్టకాల్చి మీదపడేస్తున్నారని..రెండుసార్లు రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు కేటీఆర్.