ఉమ్మడి అదిలాబాద్లో వరద బీభత్సం సృష్టించింది. ముదోల్ నియోజక వర్గంలో భారీగా పంట నష్టం ఏర్పడింది.దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారు. పంటనష్టాన్ని పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే విఠల్ రెడ్డికి తమ కష్టాలు చెప్పుకొని విలపించారు. ఓ మహిళ ఎమ్మెల్యే కాళ్లపై పడి విలపించింది. వరదతో నష్టపోయామని,తమను ఆదుకోవాలంటూ ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేసింది.