తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇక జంట జలాశయాల నుంచి మూసికి భారీగా వరద నీరు పొటెత్తుంది. లంగర్ హౌస్ బాపు ఘాట్ వద్ద వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఉస్మాన్ సాగర్, గండిపేట, హిమాయత్ సాగర్ నుంచి వచ్చే వరద నీరు బాపు ఘాట్ వద్ద కలుస్తుండటంతో వరద ప్రవాహం అధికంగా ఉంది.