పుంగనూరు ఘటనలో వైసీపీ దాడులకు తెగబడితే.. టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడం ఏమిటని నల్లపాటి రాము ధ్వజమెత్తారు. పోలీసులు వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. ఇక టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. యువగళం దెబ్బకు వైసీపీ నేతలు వణికిపోతున్నారన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసు పెట్టడం దుర్మార్గమన్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ఈ కేసులకు భయపడేది లేదన్నారు. వైసీపీ నేతల్ని ప్రజలు తరిమి కొట్టడం ఖాయమన్నారు. ఏపీలో జరిగే అరాచకాలపై కేంద్రం స్పందించాలని కోరారు.