కాంగ్రెస్ పై మండిపడిన నిరంజన్ రెడ్డి
జడ్చర్ల బహిరంగ సభలో కాంగ్రెస్ నాయకత్వాన్ని ఎండగట్టిన నిరంజన్ రెడ్డి;
కాంగ్రెస్ నేతలపై మంత్రి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. జడ్చర్ల బహిరంగ సభలో హస్తం నాయకుల ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఐదు దశాబ్దాల పాటు పాలమూరు జిల్లాకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసిందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, కరెంట్, ఫించన్, ప్రాజెక్టులు.. ఇలా అన్నీ కాంగ్రెస్ పాలనలో పెండింగ్ పెట్టిందన్నారు. పెండింగ్కు పర్యాయపదంగా మారిన కాంగ్రెస్కు పాలమూరు స్థానం లేదని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు.