ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే 2024 లోక్సభ పోల్స్ జరగవచ్చన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్. ఎన్నికలు ఏ సమయంలోనైనా జరగవచ్చని, ఒరిజినల్ షెడ్యూల్కే ఎన్నికలు జరుగుతాయనే గ్యారెంటీ లేదన్నారు. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం డిసెంబర్ లేదా జనవరిలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికలకు ముందస్తుగానే అన్ని హెలికాప్టర్లను ముందుగానే బీజేపీ బుక్ చేసుకున్నట్లు తెలిపారు. మమతా వ్యాఖ్యలపై స్పందించిన నితీష్. ఎన్డీయే ముందస్తుగానే లోక్సభ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని చాలాకాలంగా తాను చెబుతునే ఉన్నానన్నారు.