ముస్లిం, మైనార్టీల సంక్షేమానికి కేంద్రం ఎన్నో పథకాలు తెచ్చిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. ముస్లింలను కేసీఆర్ కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పోటీ తమపై ఎలాంటి ప్రభావం చూపదన్నారు. 14 శాతం ఓటర్లున్న ముస్లింలకు ముస్లిం బంధు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీతో ముస్లిం మైనార్టీలకే నష్టమన్నారు.