తిరుమల నడక మార్గాల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. చిరుత కదలికలను గుర్తించేందుకు అదనంగా మరో 300 కెమెరా ట్రాప్స్ ఏర్పాటు చేశారు అటవీ అధికారులు. మొత్తం 400లకు పైగా కెమెరా ట్రాప్స్తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. ఇప్పటికే పట్టుబడ్డ చిరుత రక్తం, డీఎన్ఏ, సెలైవా పరీక్షా ఫలితాలు.. మరో మూడ్రోజుల్లో రానున్నాయి. అటు.. నడక మార్గాల్లో.. భక్తులు గుంపులు గుంపులుగా రావాలంటూ సూచిస్తున్నారు టీటీడీ అటవీ అధికారులు. ఇక త్వరలో భక్తుల ఆత్మరక్షణ కోసం.. ఊత కర్రలు ఇస్తామని వెల్లడించారు.