పోలవరం నిర్వాసితులు తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీకి బయలుదేరారు. జంతర్ మంతర్ వద్ద ఈనెల 7న ధర్నాకు పిలుపునిచ్చారు. రాజధానికి పయనమైన నిర్వాసితులను విశాఖ రైల్వేస్టేషన్లో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నరసింగారావు కలిసి సంఘీభావం తెలిపారు. రెండో ముసాయిదా ప్రకారం 35 వేల కోట్లు ఖర్చు చేయాలి. కానీ కేంద్రం ఆమోదించింది 15 వేల 5వందల కోట్లు మాత్రమే. తమకు తీరని అన్యాయం జరిగిందని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.