పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో స్థలం విషయంలో అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పాత టౌన్ పీఎస్ ప్రదేశంలో బోర్డు పెట్టడాన్ని అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది ఈ స్థలం సబ్ కలెక్టర్ కార్యాలయానిదని తెలిపారు. గతంలో పీఎస్ ఇక్కడే ఉండేదని గుర్తు చేసిన పోలీసులు.. బిల్డింగ్ పాతబడటంతో తాత్కాలిక భవనంలోకి షిప్ట్ అయినట్లు తెలిపారు. దీనికి అంగీకరించని పోలీసులు రెవెన్యూ అధికారులు కట్టిన గోడను జేసీబీతో కూల్చేశారు. విషయం కాస్త సబ్ కలెక్టర్కు తెలియడంతో ఆయన సీరిస్ అయ్యారు. పోలీసులను ల్యాండ్ పేపర్లు తీసుకురావాల్సిందిగా కోరారు.