కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేకమని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. రేవంత్రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ ఖమ్మంలో నిరసన చేపట్టిన మంత్రి పువ్వాడ.. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ కట్ అవుతుందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ అందుతోందని చెప్పారు. గత కాంగ్రెస్ హయాంలో రైతులకు కరెంట్ కష్టాలు ఉండేవని విమర్శించారు.రైతులకు ఉచిత కరెంట్ వద్దు అన్న రేవంత్రెడ్డిని తెలంగాణ ప్రజలు తరిమికొడతారని మంత్రి పువ్వాడ తేల్చిచెప్పారు.