నిజామాబాద్ జిల్లాను తొలకరి పలకరించింది.రుతుపవనాల ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిస్తున్నాయి.గత 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే నైరుతి సీజన్లో దాదాపు 90 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. కేవలం 17 సెంటీమీటర్లు కురిసిన పరిస్థితి నెలకొంది. అటు శ్రీరాం సాగర్, నిజాం సాగర్లలో జలకళ తప్పింది.గోదావరి, మంజీర నదుల్లో నీటి ప్రవాహం తగ్గింది.