తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న మహానాడుకు రాజమహేంద్రవరం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. రెండు రోజుల పాటు జరగనున్న కార్యక్రమం నేపథ్యంలో జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలతో రహదారులు పసుపుమయంగా మారాయి. రేపు ప్రతినిధుల సభ జరగనుండగా.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. చంద్రబాబు, నారా లోకేష్ ఈ మధ్యాహ్నానికి రాజమండ్రి చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో 24 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు.