సినీ నటుడు రజనీకాంత్ ఆధ్యాత్మిక యాత్రలతో బిజిబిజీగా ఉన్నారు. ఇటీవలే రిషికేష్లోని స్వామి దయానంద గురూజీ ఆశ్రమాన్ని సందర్శించిన రజనీకాంత్... తాజాగా బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. తెల్లవారుజామున ఆలయానికి చేరుకుని రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అభిమానులకు అభివాదం చేసి, వారితో కాసేపు ముచ్చటించారు. రజనీకాంత్ బద్రీనాథ్ టూర్ ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి.