సత్యసాయి జిల్లాలో బరితెగించిన వైసీపీ నేతలు

Update: 2023-08-11 10:01 GMT

సత్యసాయి జిల్లాలో వైసీపీ నేతలు బరితెగించారు. గోరంట్ల మండలం వెంకటరమణపల్లెలో టీడీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఎరువులదిబ్బ స్థల వివాదంలో టీడీపీ కార్యకర్తలపై.. వైసీపీ నేత చౌడే రెడ్డి వర్గీయులు దాడికి దిగారు. గత నెలలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయినా.. వైసీపీ వర్గీయులు వెనక్కి తగ్గలేదు. ఎరువులదిబ్బ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు వైసీపీ నేత చౌడి రెడ్డి వర్గీయులు ప్రయత్నించారు. 

Tags:    

Similar News