కాణిపాకం వరసిద్ది వినాయకుడికి వెండి కిరీటం బహుకరణ

Update: 2023-08-11 08:42 GMT

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారికి యూకే, యూరప్ టీడీపీ ఫోరం అధ్యక్షుడు శ్యామసుందర్ నాయుడు సుమారు మూడు కిలోల వెండి కిరీటాన్ని బహుకరించారు. అధికారులు ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్ధప్రసాదాలు అందించి.. పండితులు వేదాశీర్వచనం అందచేశారు. ఆలయ ఏఈవో, స్ధానిక తెలుగుదేశం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News