హైదరాబాద్ నిప్పుల కొలిమిలా మారింది. భానుడి భగభగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటాయి. ఒకవైపు ఎండ.. మరోవైపు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండ వేడికి తోడు వడగాలులు భయపెడుతున్నాయి. ఉదయం 7 నుంచే సెగలు పుడుతున్నాయి.