బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద చల్లేందుకే బీజేపీ బాట సింగారం డబుల్ బెడ్ రూం ఇళ్ల పరిశీలన కార్యక్రమం చేపట్టిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కేంద్ర మంత్రి వర్షంలో రోడ్డుపై కూర్చోవడం సరికాదన్నారాయన. కోట్ల రూపాయలు వెచ్చించి ప్రభుత్వం పేదల కోసం నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలో రాజకీయం తగదన్నారు. బీజేపీ పేదలపై ప్రేమ ఉన్నట్లు చూపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు తలసాని.