శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీషతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పొంగునూరులో టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై వైసీపీ నేతల దాడిని ఖండిస్తూ గౌతు శిరీష ఆధ్వర్యంలో పలాసలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు పిలుపునిచ్చారు. గౌతు శిరీషతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు నోటీసులు లేకుండా గృహనిర్భంధం ఏంటని గౌతు శిరీష మండిపడ్డారు.