పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం పోరు ఉధృతం చేయాలని బీజేపీ నిర్ణయించింది.. ఇందులో భాగంగా ఈనెల 16, 17 తేదీల్లో బస్తీల్లో పర్యటించాలని పార్టీ నేతలకు కిషన్రెడ్డి సూచించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించాలన్నారు. ఈనెల 18న పేదలతో కలిసి మండల కేంద్రాల్లో.. 23, 24న కలెక్టరేట్ల ఎదుట ఆందోళన నిర్వహించాలన్నారు. సెప్టెంబర్ 4న హైదరాబాద్లో విశ్వరూప మహాధర్నాకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే .. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయన్నారు కిషన్రెడ్డి.