శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస రిజర్వాయర్ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపింది. పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. రాత్రి, తెల్లవారుజామున పులి సంచరిస్తుందని ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.