తిరుమల అడవిలో..చిక్కిన ఆడ చిరుతను జూకు తరలించారు. 3 నెలల పాటు చిరుతను జూ క్యారంటైన్లో ఉంచుతామన్నారు సీసీఎఫ్ నాగేశ్వరరావు. చిరుత రక్త నమూనాలు సేకరించి బాలిక రక్తం శాంపుల్స్ తో మ్యాచ్ చేస్తామన్నారు. చిరుత సెలైవా పరీక్షలు కూడా చేస్తామన్నారు. భక్తుల్లో భయాందోళలను తగ్గించేందుకు క్వారంటైన్ కు తరలించినట్లు తెలిపారు. మళ్లీ అడవుల్లో విడిచిపెడితే భక్తులపై దాడిచేసే ప్రమాదం ఉందని అందుకే.. జూకు తరలిస్తున్నట్లు చెబుతున్నారు. బాలికపై దాడి చేసింది ఈ చిరుతేనా లేదా అనేది తెలుసుకోవడానికి ఈ పరీక్షలంటున్నారు సీసీఎఫ్ నాగేశ్వరరావు.