ఆదివాసీ మహిళ రోడ్డుపైనే ప్రసవించిన ఘటన నిర్మల్ జిల్లా తులసిపేట దగ్గర చోటుచేసుకుంది. గర్బిణీని ఆస్పత్రిలో చేర్చేందుకు గ్రామస్తుల యత్నించారు. వాగు దాటించి అంబులెన్స్ కోసం ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్లో డీజిల్ లేదని సిబ్బంది చెప్పడంతో.. అంబులెన్స్ డ్రైవర్కు గర్బిణీ భర్త 5,00 రూపాయలు పంపాడు. అయినా అంబులెన్స్ రాకపోవడంతో నాలుగు గంటలపాటు గర్బిణీ నరకయాతన అనుభవించింది. చివరికి రోడ్డుపైనే ప్రసవించింది.