వైసీపీ పిలుపిచ్చినా చిత్తూరులో బంద్‌ ప్రభావం లేదు

Update: 2023-08-05 07:28 GMT

అధికార వైసీపీ పిలుపునిచ్చిన చిత్తూరు జిల్లా బంద్‌ ప్రభావం చూపలేదు. స్థానిక ఎమ్మెల్యే ధర్నాకు దిగినా కూడా ప్రజలు పట్టించుకోలేదు. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో శ్రీకాళహస్తిలో ఉద్రిక్తత నెలకొంది. అధికారులు అత్యుత్సాహం చూపారు. టీడీపీ ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. అనుమతులు ఉన్నా ఫ్లెక్సీలు ఎందుకు తొలగిస్తున్నారంటూ అధికారుల తీరుపై టీడీపీ శ్రేణుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, మున్సిపల్‌ అధికారుల మధ్య వాగ్వాదం నెలకొంది. రేణిగుంటలోని బాలాజీ రిజర్వాయర్‌ను చంద్రబాబు పరిశీలించనున్నారు. ఆ తరువాత శ్రీకాళహస్తిలోరోడ్‌ షో, బహిరంగ సభలలో పాల్గొంటారు. 

Tags:    

Similar News