టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. బౌలర్ రవీంద్ర జడేజా మాత్రం అడ్డుగా నిలిచాడు. కీలకమైన నాలుగు ఆసీస్ వికెట్లను తీశాడు. ఇదే క్రమంలో జడేజా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేల కుపైగా పరుగులు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా అవతరించాడు. గతంలో భారత్ తరపున క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాత్రమే ఈ ఘనతను అందుకొన్నాడు.