GAMBHIR: ఆస్పత్రిపై బెడ్‌పై తల్లి.. అయినా ఇంగ్లాండ్‌కు గంభీర్

టీమిండియా హెచ్‌ కోచ్ కీలక నిర్ణయం... సర్వత్రా ప్రశంసల జల్లు;

Update: 2025-06-17 03:30 GMT

గౌతమ్ గంభీర్.. టీమిండియాకు ఆడుతున్నపుడు అతను ఎన్నో విజయాలకు కారణమైన సరైన గౌరవాన్ని పొందలేకపోయాడు. కానీ.. గుర్తింపు అతని అస్తిత్వం కాదు. పోరాటమే అతడి అస్తిత్వం. విమర్శలు అతడికి కొత్త కాదు.. వాటికి తనదైన రీతిలో సమాధానం చెప్పుకుంటూ పోవటమే అతడి స్టైల్. భారత్, ఇంగ్లాండ్ మధ్య పటౌడీ సిరీస్ నేపథ్యంలో యంగ్ టీమిండియాకు పెద్ద దిక్కుగా ఆయన ఇంగ్లీష్ దేశానికి వెళ్ళాడు. కానీ.. ఓ సమస్య అతడిని సొంతదేశానికి రప్పించింది. ఈ నేపథ్యంలోనే కొందరు ఎప్పటిలాగానే నోటికి పని చెప్పారు. ఛాంపియన్ ప్లేయర్‌ని ఆడిపోసుకున్నారు. కానీ.. మరోసారి అతడు తనదైన రీతిలో అందరి నోర్లు మూయించాడు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇటీవల యంగ్ టీంతో కలిసి లండన్ వెళ్ళాడు. బలమైన ఇంగ్లాండ్‌ని ఎదురుకునేందుకు యంగ్ ప్లేయర్స్‌ని సన్నద్ధం చేసే పనుల్లో లీనమైపోయాడు. కానీ.. తన తల్లి గుండె పోటుకు గురైందని తెలిసి హుటాహుటిన సొంతదేశానికి తిరిగిగొచ్చాడు. ఈ నేపథ్యంలోనే పలువురు బలమైన ఇంగ్లాండ్‌ని ఎదురుకునే సత్తా లేనందుకే గంభీర్ సొంత దేశానికి వచ్చాడని విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ విమర్శలు గంభీర్ వరకు చేరాయో లేదో కానీ.. అతడు వారికి గట్టి సమాధానమే ఇచ్చాడు. తన తల్లి హాస్పిటల్ బెడ్‌పై ఉన్నప్పటికీ తన కర్తవ్య నిర్వహణ కోసం ఇంగ్లాండ్‌కు తిరిగి ప్రయాణమయ్యాడు. ఎందుకంటే.. అతడికి కావాల్సింది గుర్తింపు కాదు.. అతడి అస్తిత్వమే పోరాటం కనుక. విజయమైన, ఓటమైనా టీంతోనే ఉండి పోరాటంతోనే సమాధానమివ్వాలి కాబట్టి. తాను నమ్మే భగవంతుడు అతడి వెనుకే ఉన్నాడేమో ప్రస్తుతం తన తల్లి కోలుకుంటుందని డాక్టర్లు చెప్పారు.

లక్ష్మణ్‌కే ఆ బాధ్యతలన్నారు

గంభీర్ భారత్‌కు రాగానే ఇండియా, ఇండియా ఏ మధ్య మ్యాచ్‌‌ను పర్యవేక్షించే బాధ్యతలను అసిస్టెంట్ కోచ్‌లతో పాటు టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ మీద ఉంచారు. గంభీర్ ఈ సిరీస్‌కు దూరమవుతాడనే వార్తలు రావడంతో టీమిండియా ప్లాన్ బీలో పడింది. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పగించాలని చూసింది. అధికారిక ప్రకటన వెలువడనుంది అనగా గంభీర్ మళ్లీ తానే బాధ్యతలు చేపట్టాడు.

దిగ్గజాలు లేకుండానే

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ప్లేయర్ల రిటైర్మెంట్‌తో యంగ్ శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో భారత జట్టు ఇంగ్లాండ్‌ని ఢీ కొట్టేందుకు సిద్ధమైంది. ప్రతిష్టాత్మక పటౌడీ సిరీస్‌లో భాగంగా జూన్ 20 నుంచి ఐదు టెస్టుల్లో ఇంగ్లీష్ టీంతో తలపడేందుకు రెడీ అయ్యింది. ఇంగ్లాండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో కేఎల్ రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌లు ఆడటం టీమిండియాకు కలిసొచ్చే కీలక అంశం. వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్ కూడా ఈ సిరీస్‌తోనే ప్రారంభం కానుండటం విశేషం.

టీమిండియా స్క్వాడ్

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, సాయి సుదర్శన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్‌దీప్ యాదవ్.

Tags:    

Similar News