CHAMPIONS: మన కుర్రాళ్లు విశ్వ విజేతలు
అండర్-19 వరల్డ్కప్ 2026లో భారత్ ఛాంపియన్... ఫైనల్లో ఇంగ్లాండ్పై 100 పరుగుల విజయం... ఆరోసారి అండర్-19 భారత్ వరల్డ్కప్ టైటిల్
గతేడాది భారత మహిళల జట్లు వన్డే వరల్డ్కప్, అంధుల ప్రపంచకప్ గెలిస్తే.. కొత్త ఏడాదిలో కుర్రాళ్లు అదరగొట్టారు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అండర్-19 ప్రపంచకప్ను కైవసం చేసుకున్నారు. శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ (175; 80 బంతుల్లో 15×4, 15×6) విధ్వంసక శతకంతో మొదట భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకే ఆలౌటైంది. అండర్-19 ప్రపంచకప్ గెలవడం భారత్కు ఇది ఆరోసారి. జింబాబ్వే రాజధాని హరారేలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో, భారత్ మొదట బ్యాటింగ్ చేసి 411 పరుగులు చేసింది. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఏ జట్టు సాధించిన అత్యధిక స్కోరు ఇది. వైభవ్ సూర్యవంశీ 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగులు చేశాడు. భారీ లక్ష్య సాధనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 311 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అండర్-19 ప్రపంచ కప్ విజయాల రికార్డును భారత జట్టు అధిగమించింది. అండర్-19 ప్రపంచ కప్ను నాలుగుసార్లు గెలుచుకున్న ఆస్ట్రేలియా తర్వాత, భారత్ ఇప్పుడు ఆరోసారి ఛాంపియన్గా నిలిచింది. భారత్ గతంలో 2000, 2008, 2012, 2018, 2022లో అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. టీమిండయాను చారిత్రాత్మక విజయం దిశగా నడిపించినందున ఆయుష్ మాత్రే పేరు చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.
వరల్డ్ కప్ హీరో వైభవ్ సూర్యవంశీ
వైభవ్ సూర్యవంశీ భారత ప్రపంచ కప్ విజయానికి పునాది వేశాడు. అతను కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేశాడు, ఇది అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్ చరిత్రలో ఒక ఆటగాడు చేసిన అత్యంత వేగవంతమైన సెంచరీ. ఆ తర్వాత అతను 71 బంతుల్లో 150 పరుగుల మార్కును చేరుకున్నాడు. చివరి మ్యాచ్లో వైభవ్ 80 బంతుల్లో 175 పరుగులు చేయడం మ్యాచ్లో భారత్ పైచేయి సాధించేందుకు అవకాశం ఇచ్చింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసి భారీ స్కోర్ నమోదు చేసింది. భారత ఇన్నింగ్స్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత సెంచరీతో మ్యాచ్ను వన్ సైడ్ చేసేశాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అతని ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. కెప్టెన్ ఆయుష్ మత్రే 53 పరుగులు, అభిగ్యాన్ కుందు 40 పరుగులతో మంచి సహకారం అందించారు. చివర్లో కనిష్క్ చౌహాన్ వేగంగా 37 పరుగులు చేసి స్కోర్ను 400 దాటించాడు.
412 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభంలో పోరాడినా.. భారత బౌలర్ల ముందు నిలవలేకపోయింది. కేలబ్ ఫాల్కనర్ 115 పరుగులతో శతకం సాధించి పోరాడినా మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివరకు ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ బౌలింగ్లో ఆర్.ఎస్. అంబ్రిష్ 3 వికెట్లు, దీపేష్ దేవేంద్రన్ 2 వికెట్లు, కనిష్క్ చౌహాన్ 2 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించారు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన వైభవ్ ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డునూ గెలుచుకున్నాడు. ఒక ఐసీసీ టోర్నీలో ఈ అవార్డులు దక్కించుకున్న పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. వైభవ్ సూర్యవంశీ స్కోరు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో ఓ ప్లేయర్ చేసిన అత్యధిక స్కోరు ఇదే.