Sports News: 'ఉమెన్స్ ప్రీమియర్ లీగ్'.. యువతుల కలలకు స్ఫూర్తి: నీతా అంబానీ

Sports News: మార్చి 4న DY పాటిల్ స్టేడియంలో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ గేమ్‌లో టీమ్ ఓనర్ నీతా అంబానీ సమక్షంలో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసింది.

Update: 2023-03-18 07:46 GMT

Sports News: Woమార్చి 4న DY పాటిల్ స్టేడియంలో మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభ గేమ్‌లో టీమ్ ఓనర్ నీతా అంబానీ సమక్షంలో ముంబై ఇండియన్స్ అద్భుతమైన ప్రదర్శన చేసింది. టోర్నమెంట్‌ను ఉత్కంఠభరితంగా ప్రారంభించేందుకు ముంబై ఇండియన్స్ గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ను బ్యాటింగ్ మరియు బౌలింగ్ రెండింటితో నియంత్రించింది. స్టేడియంలో మహిళలు, పురుషులు మహిళా క్రికెట్‌కు మద్దతుగా నిలిచారు. ప్రతి బంతిని ఉత్సాహపరిచారు నీతా అంబానీ. ఎక్కువ మంది మహిళలు క్రీడలపట్ల ఆసక్తి కనబరచాలని ఆమె ఆకాంక్షించారు. చాలా మంది యువతులు క్రీడల్లో తమ కలను సాకారం చేసుకునేందుకు ఉమెన్ ప్రీమియర్ లీగ్ ఒక వేదిక కానుందని ఆమె అన్నారు. సాంప్రదాయ ముంబై ఇండియన్స్ పోస్ట్ గేమ్ డ్రెస్సింగ్ రూమ్ వేడుకలకు ఆమె నాయకత్వం వహించారు. WPL ప్రారంభ రోజు మరపురాని సంఘటన అని అంబానీ అన్నారు. "ఈ రోజు చాలా గొప్ప రోజు, క్రీడలలో మహిళలకు ఇది ఒక అపురూప క్షణం. డబ్ల్యూపీఎల్‌లో భాగం కావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది’’ అని ఆమె అన్నారు. WPL మరింత మంది మహిళలు క్రీడా వృత్తిని సంపాదించడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేసారు. అదే సమయంలో వాతావరణం అనుకూలించడాన్ని కూడా ఆమె ప్రశంసించారు. 

Tags:    

Similar News