Prithvi Shaw: దాని గురించి ఆలోచించడం లేదు
సెలక్టర్లు ఏమనుకుంటున్నారన్న దానిని ఆలోచించడం లేదన్న పృధ్వీషా... ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించడంపైనే తన దృష్టి పెట్టానని వెల్లడి;
ప్రస్తుతం టీమిండియాలోకి ఎంపిక కాకపోవడం గురించి తాను ఆలోచించడం లేదని.. ఇంగ్లండ్ కౌంటీ వన్డే క్రికెట్లో అద్భుత డబుల్ సెంచరీతో మెరిసిన టీమిండియా యువ బ్యాటర్ పృథ్వీ షా(Prithvi Shaw )స్పష్టం చేశాడు. భారత జట్టు(team india)లో చోటు ఆశించి కొంతకాలంగా పృధ్వీ షా నిరాశకు గురవుతున్నాడు. తన గురించి టీమిండియా సెలెక్టర్లు ఏమి ఆలోచిస్తున్నారనే దాని గురించి నేను నిజంగా ఆలోచించడం లేదని వెల్లడించారు. ఇంగ్లండ్ కౌంటీల్లో రాణించడంపైనే తన దృష్టి కేంద్రీకరించానని, ఇక్కడ మంచి సమయాన్ని గడపాలనుకుంటున్నానని డబుల్ సెంచరీ చేసిన అనంతరం అనంతరం వ్యాఖ్యానించాడు. నార్తంప్టన్షైర్ తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిందని... వారు నిజంగా తనను బాగా చూసుకుంటున్నారని పృథ్వీ అన్నాడు.
నార్తంప్టన్షైర్ (Northamptonshire) సపోర్టింగ్ స్టాఫ్, ఇక్కడి ఆటగాళ్లతో మంచి సమయం గడుపుతున్నానన్న పృథ్వీ... తన పూర్తి సామార్థ్యంతో మంచి ఇన్నింగ్స్ ఆడినట్లు తెలిపాడు. ఇక ఇతర ఏ విషయాల గురించి తాను ఆలోచించడం లేదని షా స్పష్టం చేశాడు. కొంతకాలం క్రితం భారత జట్టుకు ఎంపిక చేయకపోవడంతో సెలెక్టర్లపై పృథ్వీ షా అసంతృప్తి వ్యక్తం చేశాడు. సాయి బాబా అంతా చూస్తున్నాడని భావిస్తున్నానని కామెంట్స్ కూడా చేశాడు. కాగా షాను వెస్టిండీస్ పర్యటనతోపాటు ఐర్లాండ్ పర్యటన, ఆసియాగేమ్స్కు కూడా సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. జట్టుకు ఎంపిక కాక పోవడానికి అతని ఫిట్నెస్ కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.
తొలిసారి ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడుతున్న పృథ్వీ షా నార్తాంప్టన్ షైర్ జట్టు) Northamptonshire) తరఫున బరిలోకి దిగి సోమర్సెట్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఏ ఒక్క బౌలర్ను వదిలి పెట్టకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్ల (28 boundaries and 11 sixes )సాయంతో 244 పరుగులు( record-breaking double hundred) చేశాడు. షా ధాటికి నార్తంప్టన్షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 415 పరుగుల భారీ స్కోర్ చేసింది. సోమర్సెట్ బౌలర్లంతా షా ఊచకోతకు గురయ్యారు. ప్రతి బౌలర్ దాదాపు 9 రన్రేట్తో పరుగులు సమర్పించుకున్నాడు. ఓపెనర్గా వచ్చిన పృథ్వీ షా ఆరంభం నుంచి ధాటిగా ఆడాడు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన షా దాదాపుగా ప్రతి బంతిని ఫోర్ లేదా సిక్సు బాదుతూ బౌలర్లను ముప్పతిప్పలుపెట్టాడు. పృథ్వీషా విధ్వంసం ధాటికి నార్తాంప్టన్షైర్ స్కోర్ బోర్డు ఎక్స్ప్రెస్ వేగంతో పరుగులు పెట్టింది. పృథ్వీ షా మొత్తంగా 153 బంతులు ఎదుర్కొని 28 ఫోర్లు, 11 సిక్సులతో ఏకంగా 244 పరుగులు బాదేశాడు. షా స్ట్రైక్ రేట్ ఏకంగా 159గా ఉండడం గమనార్హం. టోర్నీ చరిత్రలోనే రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పాడు.