ICC: పాక్ పై కఠిన చర్యలకు ఐసీసీ సిద్ధం..!
భారత్ మ్యాచును బహిష్కరించిన పాక్... పాక్ జట్టు నిర్ణయంపై ఐసీసీ ఆగ్రహం... మళ్లీ సంక్షోభంలోకి దాయాది జట్టు ##
టీ20 వరల్డ్కప్ 2026లో గ్రూప్ స్టేజిలో భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలని తమ క్రికెట్ జట్టును ఆదేశించిన పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయంపై ఐసీసీ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. పాకిస్థాన్ ప్రభుత్వ నిర్ణయం తమ దృష్టికి వచ్చినప్పటికీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ నుంచి అధికారిక సమాచారం కోసం ఇంకా ఎదురుచూస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. టోర్నమెంట్లో ఎంపిక చేసిన మ్యాచుల్లో మాత్రమే పాల్గొనడం అనే వారి వైఖరి ఆమోదయోగ్యం కాదని ఐసీసీ తన అసంతృప్తిని వ్యక్తంచేసింది. జాతీయ విధానాలకు సంబంధించిన విషయాల్లో ప్రభుత్వాల పాత్రను గుర్తించి, గౌరవిస్తున్నప్పటికీ.. ఈ నిర్ణయం సరైంది కాదని ఐసీసీ అభిప్రాయం వ్యక్తంచేసింది. అలాగే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్, పాకిస్థాన్లోని లక్షలాది మంది అభిమానులకు మంచిది కాదంది. పాక్ నిర్ణయం.. ఆ దేశంలోని క్రికెట్పై చూపే దీర్ఘకాలిక ప్రభావాలను జాగ్రత్తగా పరిశీలించాలని పీసీబీని .. ఐసీసీ కోరింది.
ఇందుకు అనుమతి ఇవ్వడం తీవ్ర వివాదానికి దారి తీస్తోంది. ఈ నిర్ణయాన్ని బంగ్లాదేశ్కు సంఘీభావంగా తీసుకున్న చర్యగా పాకిస్థాన్ ప్రభుత్వం సమర్థించుకుంటున్నా.. లోతుగా పరిశీలిస్తే ఇందులో స్పష్టమైన ద్వంద్వ ప్రమాణాలు కనిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బంగ్లాదేశ్ మ్యాచ్లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చేందుకు ఐసీసీ నిరాకరించడాన్ని పాకిస్థాన్ వ్యతిరేకిస్తోంది అని ఆ దేశ పాకిస్థాన్ మీడియా కథనాలు ప్రకారం చేసింది. గతంలో ఛాంపియన్స్ ట్రోఫీ, మహిళల వన్డే వరల్డ్ కప్లకు హైబ్రిడ్ మోడల్ను అనుసరించిన ఐసీసీ, ఇప్పుడు “పక్షపాత నిర్ణయాలు” తీసుకుంటోందని పాక్ ఆరోపిస్తోంది.
జిత్తులమారి పాక్
భారత్తో మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి, మిగతా అన్ని మ్యాచ్లలో పాల్గొనడం ద్వారా ఐసీసీ నుంచి వచ్చే ఆదాయాన్ని పీసీబీ అందుకుంటూనే ఉంది. అదే ఐసీసీని పక్షపాత సంస్థగా విమర్శిస్తూ, దాని ప్రయోజనాలను ఆస్వాదించడం స్పష్టమైన విరుద్ధతగా కనిపిస్తోంది. ఇక, భారత్ పాకిస్థాన్కు వెళ్లి ఆడేందుకు నిరాకరించడంపై పాక్ గతంలో ఎన్నో సార్లు నిరసనలు తెలిపింది. అయినప్పటికీ, భారీ గ్లోబల్ వీక్షకులు, భారీ ఆదాయం దృష్ట్యా ఐసీసీ టోర్నీల్లో భారత్తో ఆడేందుకు మాత్రం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అలాంటిది, ఇప్పుడు అకస్మాత్తుగా భారత్తో ఒక్క మ్యాచ్ను మాత్రమే బహిష్కరించి బంగ్లాదేశ్కు మద్దతు తెలిపితే, రాజకీయ లబ్ధి కోసం వేసిన ఎత్తుగడగా కనిపిస్తోందా అని పాక్ కి చెందిన కొందరు విమర్శకులు గుప్పిస్తున్నారు. ఇక, ఒకే టోర్నీలో ఒక కీలక మ్యాచ్ను మాత్రమే వదిలేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధం.. నిజంగా ‘న్యాయ సూత్రాల’ కోసం బహిష్కరణ అనుకుంటే, మొత్తం ఈవెంట్ నుంచే తప్పుకోవాల్సి ఉంటుంది.. కానీ అలా చేయకుండా, టోర్నీకి అతిపెద్ద ఆదాయాన్ని తెచ్చే భారత్- పాకిస్థాన్ మ్యాచ్ను మాత్రమే అడ్డుకోవడం.. అదే సమయంలో ఆర్థిక శిక్షలు లేదా క్రీడా ఒంటరితనం నుంచి తప్పించుకోవడం కోసమే ఇలా పాకిస్తాన్ చేసిందని క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. పాక్ ఆరోపణలపై ఐసీసీ తాజాగా స్పందించింది.. భారత్ తో మ్యాచ్ ఆడేందుకు దాయాది దేశం పునరాలోచన చేయాలని కోరింది. రాజకీయ కారణాలతో జట్లు తమకు నచ్చిన ప్రత్యర్థులను ఎంచుకుని బహిష్కరిస్తే, వరల్డ్కప్ నిర్మాణం, విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుందని ఐసీసీ పేర్కొంది.