IND VS PAK: తుది జట్టులో ఉండేదెవరు..?

తొలిసారి బరిలోకి యువ ఆటగాళ్లు

Update: 2025-09-14 05:30 GMT

ఆసి­యా­క­ప్ 2025లో భా­గం­గా నేడు భా­ర­త్, పా­కి­స్థా­న్ మ్యా­చ్ జర­గ­నుం­ది. తొలి మ్యా­చ్‌­లో యూ­ఏ­ఈ­ని చి­త్తు చే­సిన టీ­మిం­డి­యా.. రె­ట్టిం­చిన ఉత్సా­హం­తో దా­యా­ది­తో మ్యా­చ్‌­కు సి­ద్ధ­మైం­ది. అయి­తే తొలి మ్యా­చ్‌­తో పో­లి­స్తే.. ఈ మ్యా­చ్‌­కు భారత తుది జట్టు­లో పలు మా­ర్పు­లు చోటు చే­సు­కు­నే అవ­కా­శం కని­పి­స్తోం­ది. అర్ష­దీ­ప్ సిం­గ్‌­ను జట్టు­లో­కి తీ­సు­కు­నే అవ­కా­శం ఉంది. జి­తే­శ్ శర్మ కోసం సంజూ శాం­స­న్‌ బెం­చ్‌­కే పరి­మి­తం కా­వొ­చ్చు. అర్ష­దీ­ప్ సిం­గ్ తుది జట్టు­లో ఉం­డా­ల­ని మే­నే­జ్‌­మెం­ట్ భా­వి­స్తే ఆల్‌­రౌం­డ­ర్‌ శి­వ­మ్ దూ­బే­కు ఛా­న్స్ దొ­ర­క­క­పో­వ­చ్చు. యూ­ఏ­ఈ­తో మ్యా­చ్‌­లో సంజూ శాం­స­న్ వి­కె­ట్ కీ­ప­ర్‌­గా జట్టు­లో చోటు దక్కిం­చు­కు­న్నా­డు. కానీ పా­కి­స్థా­న్‌­తో మ్యా­చ్‌­లో అత­డి­కి చోటు దక్క­క­పో­వ­చ్చు. ఎం­దు­కం­టే గిల్, అభి­షే­క్ శర్మ ఓపె­న­ర్లు­గా ఫి­క్స్ అయ్యా­రు. మి­డి­ల్ ఆర్డ­ర్‌­లో సూ­ర్య­కు­మా­ర్ యా­ద­వ్, తి­ల­క్ వర్మ ఉన్నా­రు. ఆ తర్వాత ఆల్‌­రౌం­డ­ర్లు అక్ష­ర్ పటే­ల్, హా­ర్ది­క్ పాం­డ్యా­లు వస్తా­రు. దీం­తో జట్టు­లో­కి స్పె­ష­లి­స్ట్ ఫి­ని­ష­ర్‌­ను తీ­సు­కో­వా­ల­ని భా­ర­త్ భా­వి­స్తోం­ది. అం­దు­కే ఐపీ­ఎ­ల్‌­లో ఫి­ని­ష­ర్ రో­ల్‌­ను సమ­ర్థ­వం­తం­గా పో­షిం­చిన జి­తే­శ్ శర్మ­ను తీ­సు­కు­నే అవ­కా­శం ఉంది. అదే జరి­గి­తే సంజూ శాం­స­న్‌ బెం­చ్‌­పై కూ­ర్చు­నే అవ­కా­శం ఉంది.

ఆసి­యా కప్‌­లో భా­ర­త్ - పాక్ మ్యా­చ్ కోసం అం­ద­రూ ఆస­క్తి­గా ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. ఈ మ్యా­చ్‌­కు ముం­దు పాక్ కె­ప్టె­న్ సల్మా­న్ అలీ అఘా సవా­ల్ వి­స­ర­డం­తో మరింత వేడి రా­జు­కుం­ది. భా­ర­త్ - పాక్ పోరు సమీ­పి­స్తు­న్న నే­ప­థ్యం­లో దే­శీ­యం­గా మరో వి­వా­దం చె­ల­రే­గిం­ది. ఆప­రే­ష­న్ సిం­దూ­ర్ నే­ప­థ్యం­లో ఈ మ్యా­చ్ జర­గ­కూ­డ­ద­ని కొం­ద­రు పౌ­రు­లు అభి­ప్రా­యం వ్య­క్తం చే­శా­రు. సు­ప్రీం­కో­ర్టు­లో పి­టి­ష­న్ కూడా వే­సి­నా, కో­ర్టు దా­ని­ని తి­ర­స్క­రిం­చిం­ది. భా­ర­త్ ఐసీ­సీ, ఆసి­యా కప్ లాం­టి టో­ర్న­మెం­ట్ల­లో మా­త్ర­మే పా­కి­స్తా­న్‌­తో ఆడ­వ­చ్చు,

తొలిసారి బరిలోకి...

ఆసి­యా కప్‌­లో భా­ర­త్, పా­కి­స్తా­న్ మధ్య జర­గ­బో­యే హై-వో­ల్టే­జ్ మ్యా­చ్ కోసం క్రి­కె­ట్ అభి­మా­ను­లు ఎంతో ఆస­క్తి­గా ఎదు­రు­చూ­స్తు­న్నా­రు. ఈ మ్యా­చ్ నేడు దు­బా­య్ ఇం­ట­ర్నే­ష­న­ల్ క్రి­కె­ట్ స్టే­డి­యం­లో జర­గ­నుం­ది. ఈ మ్యా­చ్ కోసం భారత జట్టు­లో ఐదు­గు­రు యువ ఆట­గా­ళ్లు ఉన్నా­రు. వీరు పా­కి­స్తా­న్‌­తో ఇప్ప­టి­వ­ర­కు ఒక్క మ్యా­చ్ కూడా ఆడ­లే­దు. ఈ కీలక మ్యా­చ్‌­లో వా­రి­కి పా­కి­స్తా­న్‌­తో తల­ప­డే అవ­కా­శం లభిం­చ­వ­చ్చ­ని తె­లు­స్తోం­ది.

2012-13 నుం­చి భా­ర­త్, పా­కి­స్తా­న్ మధ్య ఎలాం­టి ద్వై­పా­క్షిక సి­రీ­స్‌­లు జర­గ­లే­దు. ఈ రెం­డు జట్ల మధ్య మ్యా­చ్‌­లు కే­వ­లం ఐసీ­సీ, ఏసీ­సీ ఈవెం­ట్‌­ల­లో మా­త్ర­మే జరు­గు­తు­న్నా­యి. ఈ కా­ర­ణం వల్ల భారత జట్టు­లో ఉన్న యువ ఆట­గా­ళ్ల­కు పా­కి­స్తా­న్‌­తో మ్యా­చ్ ఆడే అవ­కా­శం లభిం­చ­లే­దు. ఈ ఐదు­గు­రు ఆట­గా­ళ్ల జా­బి­తా­లో ఓపె­నిం­గ్ బ్యా­ట్స్‌­మె­న్ అభి­షే­క్ శర్మ, వి­కె­ట్ కీ­ప­ర్ బ్యా­ట్స్‌­మె­న్ సంజూ శాం­స­న్, జి­తే­ష్ శర్మ ఉన్నా­రు. వీ­రి­తో పాటు యువ సం­చ­ల­నా­లు తి­ల­క్ వర్మ, రిం­కూ సిం­గ్ కూడా పా­కి­స్తా­న్‌­తో ఇప్ప­టి­వ­ర­కు ఒక్క మ్యా­చ్ కూడా ఆడ­లే­దు. ఈ మ్యా­చు­లో వీరు సత్తా చా­టా­ల­ని చూ­స్తు­న్నా­రు.

Tags:    

Similar News