KL RAHUL: రాహుల్.. మరీ ఇంత అంకితభావమా..?
ఇంగ్లాండ్కు పయనమైన కేఎల్ రాహుల్;
భారత్, ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికైన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ టెస్ట్ సిరీస్ కన్న ముందే వార్మప్ మ్యాచులలో పాల్గొననున్నాడు. ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య జరగనున్న మ్యాచ్ల్లో రాహుల్ ఇండియా-ఏ తరపున ఆడనున్నాడు. ఇండియా-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ మధ్య తొలి మ్యాచ్ మే 30 నుంచి జూన్ 2 వరకు జరగనుంది. రెండో మ్యాచ్ జూన్ 6 నుంచి 9 వరకు నార్తాంప్టన్లో నిర్వహించనున్నారు. సోమవారం అతను ఇంగ్లండ్ వెళ్లేందుకు సిద్దం అవుతున్నాడు. జూన్లో ఇంగ్లండ్తో జరిగే టెస్టు సిరీస్కు రెఢీ అవుతున్న సీనియర్ టీమిండియా క్రికెటర్.. ప్రిపరేషన్ కోసం ముందే వెళ్తున్నట్లు సమాచారం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపు ఆడిన కేఎల్ రాహుల్.. ప్రస్తుతం ఇంగ్లండ్లో టూరు చేస్తున్న ఇండియా ఏ జట్టు తరపున ఆడాలనుకుంటున్నాడు. సీనియర్ల టెస్టు సిరీస్ కు ఎంపికైన అతను.. ప్రాక్టీసు కోసం ముందే ఇంగ్లండ్కు వెళ్లాలనుకుంటున్నాడు. దీని కోసం అతను బీసీసీఐ నుంచి పర్మిషన్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. . మే 30వ తేదీ నుంచి క్యాంటర్ బరీలో తొలి టెస్టు జరగనున్నది అయితే ఆ మ్యాచ్ను రాహుల్ అందుకోలేడు. కానీ రెండవ మ్యాచ్లో ఆడేందుకు అనుమతి పొందిన కేఎల్ రాహుల్.. తొందరగా ఇంగ్లండ్ వెళ్లేందుకు రెఢీ అయ్యాడు
నీ డెడికేషన్ కు సలాం
ప్రస్తుతం భారత్లో వాతావరణ పరిస్థితులు ప్రాక్టీస్కు అనుకూలంగా లేకపోవడంతో లయన్స్తో టెస్ట్ మ్యాచ్ తన ప్రాక్టీస్కు ఉపయోగపడుతుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇందుకే తనను లయన్స్తో రెండో టెస్ట్ మ్యాచ్కు ఎంపిక చేయాలని బీసీసీఐని కోరాడట. ఈ విషయంపై స్పందించిన అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ రాహుల్కు రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. జాతీయ జట్టు తరఫున రాణించేందుకు రాహుల్ బీసీసీఐకి చేసిన విన్నపం గురించి తెలిసి భారత క్రికెట్ అభిమానులు ఫిదా అవుతున్నారు. రాహుల్ కమిట్మెంట్కు సలాం కొడుతున్నారు.