IPL: ధోనీ ఖాతాలో సిక్సర్ల రికార్డు

Update: 2025-04-01 03:00 GMT

చెన్నై సూపర్‌ కింగ్స్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో అద్భుత రికార్డు సాధించాడు. 30 ఏళ్లు నిండిన తర్వాత ఐపీఎల్‌లో 200 సిక్స్‌లు బాదిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తుషార్ దేశ్‌పాండే వేసిన 19 ఓవర్‌లో సిక్స్ బాదడం ద్వారా ధోనీ ఈ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా ఈ జాబితాలో ధోనీ రెండో స్థానంలో ఉండగా.. క్రిస్‌గేల్ (347 సిక్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు. భారత ఆటగాళ్ల విషయానికొస్తే.. ధోనీ తర్వాత రోహిత్ శర్మ (113), అంబటి రాయుడు (109), దినేశ్ కార్తిక్ (104) మాత్రమే 30 ఏళ్లు నిండిన తర్వాత 100 కంటే ఎక్కువ సిక్సర్లు బాదారు. ధోనీ వయసు 43 ఏళ్లు. అయినప్పటికీ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ ఐపీఎల్‌లో తన కెరీర్‌ను కొనసాగిస్తున్నాడు. పూర్తిస్థాయి వికెట్‌కీపర్‌గా ఉంటూ మెరుపు స్టంపింగ్స్ చేస్తున్నాడు.

Tags:    

Similar News