IPL: తలా వచ్చినా చెన్నై తలరాత మారలేదు

అయిదో మ్యాచ్‌లోనూ చెన్నై పరాజయం.. కోల్‌కతా ఘన విజయం;

Update: 2025-04-12 01:30 GMT

ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై పరాజయాల పరంపర ఆగలేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చెన్నై అయిదో మ్యాచులో ఓటమి చెందింది. చెపాక్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌పై.. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ విఫలమవడంతో, కోల్‌కతా‌కు తక్కువ స్కోరు చేధించడంలో ఎలాంటి కష్టాలూ ఎదురుకాలేదు. ఈ మ్యాచ్ ప్రారంభంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 103 పరుగులు మాత్రమే చేయగలిగింది. 104 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు ఆరంభం నుంచే విజయం వైపు నడిచింది. కేవలం 10.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్ సునీల్ నరైన్ చెలరేగిపోయాడు. డికాక్ 23, రహానే 20 పరుగులతో సహకరించారు.

బ్యాటర్ల చెత్త ప్రదర్శన

మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాటర్లు దారుణ ప్రద‌ర్శన క‌న‌బ‌రిచారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి కేవ‌లం 103 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. సీఎస్‌కే బ్యాటింగ్ లైన‌ప్ పేక‌మేడ‌లా కుప్ప‌కూలింది. ఏ ఒక్క బ్యాట‌ర్ కూడా కేకేఆర్ బౌల‌ర్ల‌ను స‌రిగ్గా ఎదుర్కోలేక‌పోయాడు. శివ‌మ్ దూబే(31 నాటౌట్‌) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. విజ‌య్ శంక‌ర్‌(29) కాస్త ఫ‌ర్వాలేద‌న్పించాడు. సునీల్ న‌రైన్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. హ‌ర్షిత్ రానా, వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి త‌లా రెండు వికెట్లు సాధించారు. 104 ప‌రుగుల స్వల్ప ల‌క్ష్యాన్ని కేకేఆర్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి కేవ‌లం 10.1 ఓవ‌ర్ల‌లోనే చేధించింది. సునీల్ న‌రైన్‌ 2 ఫోర్లు, 5 సిక్స్‌ల‌తో 44) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు

రిటైర్ కావాల్సిందే

ఒక దిగ్గజ ఆటగాడిగా జట్టుకు ఎన్నో గొప్ప విజయాలను అందించిన ధోని ఇబ్బంది పడటం క్రికెట్ అభిమానులు చూడలేకపోతున్నారు. 42 ఏళ్ల వయసులో ధోని టీంకి ఆడకపోవడమే బెటర్ అని పలువురు సలహా ఇస్తున్నారు. సొంత ప్రయోజనాలను వదులుకొని యంగ్, టాలెంటెడ్ క్రికెటర్లకు స్థానం కల్పించాలని కోరుతున్నారు. గత మ్యాచ్‌కు ధోని పేరెంట్స్ హాజరు కావడంతో రిటైర్ అవుతారేమో అని అంత భావించారు. కానీ.. రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో గౌరవప్రదంగానే టీం నుంచి తప్పుకుంటే ఉత్తమం.

దద్దరిలిన స్టేడియం

ఐపీఎల్‌లో సుదీర్ఘ విరామం తర్వాత మహేంద్రసింగ్ ధోనీ.. మళ్లీ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఐపీఎల్‌లో విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకడిగా ఉన్న ధోనీ.. రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్.. గాయంతో టోర్నీకి దూరం కావడంతో మళ్లీ టాస్‌కు వచ్చాడు. శుక్రవారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘటన ఆవిష్కృతమైంది. అయితే ధోనీ టాస్‌కు వచ్చినప్పుడు చెపాక్‌లోని సీఎస్కే ఫ్యాన్స్ వేసిన విజిల్స్‌తో స్టేడియం దద్దరిళ్లిపోయింది.

Tags:    

Similar News