IPL: ముంబైపై గెలుపు.. అగ్రస్థానానికి పంజాబ్‌

ముంబైపై పంజాబ్‌ ఘన విజయం... పాయింట్ల పట్టికలో టాప్‌కు పంజాబ్‌;

Update: 2025-05-27 02:00 GMT

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదరగొట్టింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించి అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయంతో పంజాబ్‌ జట్టు క్వాలిఫయర్-1లో ఆడేందుకు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో పంజాబ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 18.3 ఓవర్లలోనే 3 వికెట్లే కోల్పోయి ఛేదించింది.

సూర్య ఒక్కడే

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన.. ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. పంజాబ్ కింగ్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినప్పటికీ సూర్య కుమార్ మాత్రం చెలరేగిపోవడంతో ముంబై ఇండియన్స్ ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్ లో అర్థ శతకం బాదిన సూర్య.. జట్టుకు భారీ స్కోర్ అందించాడు. సూర్యకుమార్ యాదవ్ (57; 39 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే భారీ స్కోరు చేశాడు. ఓపెనర్లు రికెల్‌టన్ (27), రోహిత్ శర్మ (24) ఫర్వాలేదనిపించారు. హార్దిక్ పాండ్య (26), నమన్ ధీర్ (20), విల్ జాక్స్ (17) పరుగులు చేశారు. తిలక్ వర్మ (1) నిరాశపర్చాడు. పంజాబ్ బౌలర్లలో మార్కో యాన్సెన్ 2, అర్ష్‌దీప్ సింగ్ 2, విజయ్‌కుమార్ వైశాఖ్‌ 2, హర్‌ప్రీత్ బ్రార్ ఒక వికెట్ పడగొట్టారు. **ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్‌ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

ఇంగ్లీస్-ప్రియాంశ్ షో..

ఓ మాదిరి ఛేజింగ్ తో బ్యాటింగ్ ను ప్రారంభించిన పంజాబ్ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ త‌గిలింది. త‌న‌కు ల‌భించిన లైఫ్ ను యూజ్ చేసుకోలేని ఓపెన‌ర్ ప్ర‌భ్ సిమ్రాన్ సింగ్ (13) త్వ‌ర‌గా ఔట‌య్యాడు. ఈ ద‌శ‌లో మ‌రో ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 62, 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో క‌లిసి ఇంగ్లీస్ చ‌క్క‌ని ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లీస్ 20 బంతుల్లో, 27 బంతుల్లో ప్రియాంశ్ అర్థ సెంచ‌రీలు సాధించారు. వీరిద్ద‌రూ రెండో వికెట్ కు 109 ప‌రుగులు జోడించ‌డంతో పంజాబ్ దాదాపు విజ‌యం ముంగిట నిలిచింది. ఆ త‌ర్వాత ప్రియాంశ్ ఔటైనా.. ఇంగ్లీస్ కాసేపు దూకుడుగా ఆడి, ఔటయ్యాడు. చివ‌ర్లో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ ( 26 నాటౌట్), నేహాల్ వ‌ధేరా (2 నాటౌట్) లాంఛ‌నాన్ని పూర్తి చేసి, జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. 

Tags:    

Similar News