RAHANE: సారథ్యానికి రహానే గుడ్ బై

Update: 2025-08-22 06:30 GMT

సు­దీ­ర్ఘ­మైన దే­శ­వా­ళీ క్రి­కె­ట్‌ సీ­జ­న్‌ ప్రా­రం­భా­ని­కి ముం­దు ముం­బై క్రి­కె­ట్‌ జట్టు­తో పాటు అభి­మా­ను­ల­కు షా­క్‌ తగి­లిం­ది. సీ­ని­య­ర్‌ బ్యా­ట్స్‌­మె­న్‌ అజిం­క్య రహా­నే కె­ప్టె­న్సీ­కి రా­జీ­నా­మా చే­శా­డు. ఈ మే­ర­కు సో­ష­ల్‌ మీ­డి­యా వే­ది­క­గా పో­స్ట్‌ చే­శా­రు. జట్టు కొ­త్త నా­య­క­త్వా­న్ని అభి­వృ­ద్ధి చే­సు­కో­వ­డా­ని­కి ఇదే సమయం మంచి సమ­య­మ­ని పే­ర్కొ­న్నా­డు. జట్టు­కు నా­య­క­త్వం వహిం­చ­డం, టో­ర్న­మెం­ట్‌ గె­లు­వ­డం తనకు చాలా గౌ­ర­వ­మ­ని పే­ర్కొ­న్నా­డు. "ముం­బై జట్టు­కు కె­ప్టె­న్‌­గా వ్య­వ­హ­రిం­చ­డం, ఛాం­పి­య­న్‌­షి­ప్‌­లు గె­ల­వ­డం నాకు దక్కిన గొ­ప్ప గౌ­ర­వం. రా­బో­యే దే­శ­వా­ళీ సీ­జ­న్‌­ను దృ­ష్టి­లో పె­ట్టు­కు­ని, ఒక కొ­త్త నా­య­కు­డి­ని సి­ద్ధం చే­య­డా­ని­కి ఇదే సరైన సమ­య­మ­ని నేను నమ్ము­తు­న్నా­ను. అం­దు­కే కె­ప్టె­న్సీ బా­ధ్య­తల నుం­చి వై­దొ­ల­గా­ల­ని ని­ర్ణ­యిం­చు­కు­న్నా­ను" అని రహా­నే 'ఎ­క్స్' ఖా­తా­లో పే­ర్కొ­న్నా­రు. ఒక ఆట­గా­డి­గా జట్టు­కు తన సే­వ­లు అం­ది­స్తూ­నే ఉం­టా­న­ని, ముం­బై­కి మరి­న్ని ట్రో­ఫీ­లు అం­దిం­చేం­దు­కు కృషి చే­స్తా­న­ని ఆయన పే­ర్కొ­న్నా­డు.

యశస్వికా? శ్రేయస్‌కా?

ముంబై జట్టులో నాణ్యమైన ఆటగాళ్లకు కొదవేం లేదు. అయ్యర్‌, సూర్యకుమార్‌, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్‌ ఖాన్ వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ఉన్నారు. శ్రేయస్, సూర్య ఐపీఎల్‌లో సారథ్యం చేపట్టిన అనుభవం ఉంది. టెస్టుల్లో యశస్వి జైస్వాల్‌ దూకుడు చూస్తూనే ఉన్నాం. వారిద్దరితో పోలిస్తే యశస్వి సుదీర్ఘ ఫార్మాట్‌లో మంచి ఇన్నింగ్స్‌లు నిర్మించగల సమర్థుడు. ఇటీవలే అతడు గోవా జట్టుకు ఆడదామనే ఆలోచనను కూడా విరమించుకున్నాడు. యశస్వికే జట్టు పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది.

Tags:    

Similar News