RCB: బెంగళూరుపై ప్రశంసల వర్షం
ఆర్సీబీ విజయంపై ప్రశంసలు.. చారిత్రాత్మక గెలుపున్న ప్రముఖులు;
18 ఏళ్ల కలకు నెరవేర్చుకుంటూ.. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ఆర్సీబీ ఐపీఎల్ కప్పును ముద్దాడింది. 18 ఏళ్ల అవిశ్రాంత పోరాటం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2025లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఆరు పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఆర్సీబీ 10 సార్లు ప్లేఆఫ్కు వెళ్లింది. ఆ పదిలో నాలుగు సార్లు ఫైనల్కు చేరుకుంది. 2009, 2011, 2016లో ఫైనల్ వరకు వెళ్లింది. కానీ, కప్పు గెలవలేకపోయింది. ఈ సారి మాత్రం వీరోచితంగా పోరాడి గెలుపును కైవసం చేసుకుంది. ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత తొలిసారి విజయం సాధించటంపై రాజకీయ, సినీ, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లులు కురిపించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆర్సీబీపై ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ సెలబ్రిటీల్లో క్రికెట్ను అభిమానించేవారు ఎవరంటే ముందుగా గుర్తోచ్చేది వెంకీ మామనే.. ఆర్సీబీ విజయం సాధించగానే వెంకటేశ్ పోస్ట్ పెట్టారు. చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చారు.
‘ఐపీఎల్ ఫైనల్లో పంజాబ్ టీమ్ను ఓడించి కప్ గెలుచుకున్న ఆర్సీబీ టీమ్కు అభినందనలు. అద్భుతమైన ప్రదర్శన కనబరిచి కోట్లాది మంది అభిమానుల కలను ఆర్సీబీ ఆటగాళ్లు నెరవేర్చారు. ఆర్సీబీ విజయంలో విరాట్ కోహ్లీ 18 ఏళ్ల తపస్సు ఉంది. ప్రతీ ఒక్క ఆర్సీబీ ఆటగాడు చాంపియన్ ప్రదర్శన ఇచ్చారనటంలో ఎలాంటి అనుమానం లేదు’-కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య
‘ఐపీఎల్లో తొలిసారి విజయం సాధించిన ఆర్సీబీకి అభినందనలు. కెప్టెన్ రజత్ పాటిదార్ నాయకత్వంలో కప్పు గెలవటం సంతోషంగా ఉంది. మధ్యప్రదేశ్ వారికి ఇది గర్వకారణం’ **మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
‘‘ఇది విజయం కాదు.. అంతకు మించినది. భావోద్వేగ క్షణాలివి’’ - డీకే శివకుమార్
‘‘ఐపీఎల్లో మొదటిసారి విజేతగా నిలిచిన ఆర్సీబీకి హృదయపూర్వక అభినందనలు. కెప్టెన్ పాటీదార్ నాయకత్వంలో ఈ కప్పు గెలవడం ఇంకా ఆనందంగా ఉంది. మధ్యప్రదేశ్ వారికి ఇది మరింత గర్వకారణం. మీరంతా గొప్పగా ఆడారు’’ - మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
‘‘ఆర్సీబీ విజయం సాధించినప్పుడు మేం విమానంలో ఉన్నాం. ఫ్లైట్ దిగిన వెంటనే గూగుల్ చేసి ఎంతో ఆనందించాం. నాతోపాటు శశిథరూర్ కూడా ఉన్నారు. ఆయన కూడా ఆర్సీబీ అభిమానే’’. - ఎంపీ తేజస్వి సూర్య
‘‘నేను వాషింగ్టన్లో అడుగుపెట్టిన వెంటనే చేసిన మొదటి పని స్కోర్ చూడడం. 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత కల నెరవేరింది. విరాట్కు ప్రత్యేక అభినందనలు. చాలా సంతోషంగా ఉంది’’ - ఎంపీ శశిథరూర్
అల్లు అర్జున్ రియాక్షన్ ఇదే..
ఆర్సీబీ జట్టు విజయం పట్ల తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రత్యేకంగా ట్వీట్ చేస్తూ, “నిరీక్షణ ముగిసింది. ‘ఈ సాలా కప్ మనదే!’ ఈ రోజు కోసం మేము 18 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాము. ఆర్సీబీకి హృదయపూర్వక అభినందనలు” అంటూ తన ఉల్లాసాన్ని షేర్ చేసుకున్నారు. బన్నీ అభిమానం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఆర్సీబీ అభిమానులతో అతని భావోద్వేగం పంచుకుంది. ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, “RCB జట్టుకు, వారి అభిమానులకు అభినందనలు. మీరు ఎంతో ఓర్పుతో, ప్రేమతో ఎదురు చూశారు. ఇది చూడటానికి చాలా సంతోషకరమైన క్షణం” అంటూ ఆ జట్టు విజయాన్ని ప్రశంసించారు. కేవలం తెలుగు సినీ ప్రముఖులే కాకుండా తమిళనాడు నుంచి కూడా అభినందనల వెల్లువ కురిసింది. తమిళ నటుడు శంతను భాగ్యరాజ్ స్పందిస్తూ, [“ఆర్సీబీ జట్టుకు అభినందనలు](https://vaartha.com). మీరు ఎంతో గొప్పగా ఆట ఆడారు. ‘ఆర్సీబీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 18 ఏళ్ల ఎదురుచూపునకు ముగింపు చెప్పినందుకు సంతోషంగా ఉంది. ఈ విజయానికి మీరు నిజంగా అర్హులే’ హీరో వెంకటేష్ కొనియాడారు.