భారత షూటర్ అవని లేఖర సరికొత్త రికార్డు
SH1 రైఫిల్లోని అథ్లెట్లకు వారి కాళ్లలో బలహీనత ఉంది. కొంతమంది అథ్లెట్లు కూర్చున్న స్థానంలో పోటీపడితే, మరికొందరు స్టాండింగ్ పొజిషన్లో పోటీపడతారు.
భారత షూటర్ అవని లేఖర సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్గా ఘనత సాధించింది. మహిళల 50 మీటర్ల ఎస్హెచ్1 ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు మహిళల 10ఎం ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్హెచ్1 ఈవెంట్లో అవని బంగారు పతకం పొందింది.