VIRAT KOHLI: విజయోత్సవ విషాదంపై దిగ్భ్రాంతి
తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మృతి.. స్పందించిన విరాట్ కోహ్లీ;
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవంలో భారీ ఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుని 11 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సర్వత్రా తీవ్ర విచారం వ్యక్తమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ క్రికెటర్ సచిన్ సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విచారణ చేపట్టలని కర్ణాటక ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. ఈ ఘటనపై రాయల్ ఛాలెంజర్స్ మేనేజ్మెంట్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
మాటలు రావట్లేదు
విరాట్ కోహ్లీ ఈ ఘటనపై స్పందించాడు. తొక్కిసలాట ఘటనతో మాటలు రావట్లేదని, తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ‘‘తొక్కిసలాట వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. మా అభిమానులందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. మీడియాలో వచ్చిన కథనాలతో ఈ ఘటన గురించి మాకు తెలిసింది. అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మాకు ప్రతి ఒక్కరి క్షేమం అత్యంత కీలకం. దీని గురించి తెలిసిన వెంటనే మా కార్యక్రమాలను రద్దు చేసుకున్నాం. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. స్థానిక అధికారులకు మా పూర్తి సహకారం అందిస్తాం. ఈ సందర్భంగా మాకు మద్దతుగా నిలిచే వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని ఆర్సీబీ పేర్కొంది. **తొక్కిసలాట జరిగినప్పటికీ, స్టేడియం లోపల కొద్దిసేపు విజయోత్సవ వేడుకలు జరిగాయి. ఆర్సిబి కెప్టెన్ రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. అయితే, బయట జరిగిన విషాదం గురించి తెలియగానే, వేడుకలను రద్దు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సంఘటన స్థలాన్ని సందర్శించి, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారాన్ని ప్రకటించారు.