WTC: ఇంగ్లాండ్‌లోనే డబ్ల్యూటీసీ ఫైనల్స్

3 ఐసీసీ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం

Update: 2025-10-04 07:00 GMT

ప్ర­పంచ టె­స్ట్ ఛాం­పి­య­న్‌­షి­ప్ ఫై­న­ల్ 2031 వరకు ఇం­గ్లాం­డ్‌­లో­నే జరు­గు­తుం­ద­ని అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్ కౌ­న్సి­ల్ ప్ర­క­టిం­చిం­ది. ప్ర­పంచ టె­స్టు ఛాం­పి­య­న్‌­షి­ప్‌ 2019 మొ­ద­ల­వ­గా.. ఇప్ప­టి­వ­ర­కు జరి­గిన మూడు ఫై­న­ల్స్‌­కు ఇం­గ్లాం­డ్‌ ఆతి­థ్య­మి­చ్చిం­ది. వర­ల్డ్ టె­స్ట్ చాం­పి­య­ప్‌­‌­‌­‌­‌­‌­‌­‌­షి­ప్ (డబ్ల్యూ­టీ­సీ) ఫై­న­ల్ వే­ది­క­ను ఐసీ­సీ మా­ర్చ­లే­దు. గత మూడు ఫై­న­ల్స్‌­‌­‌­‌­‌­‌­‌­‌­ను వి­జ­య­వం­తం­గా ని­ర్వ­హిం­చిన ఇం­గ్లం­డ్‌­‌­‌­‌­‌­‌­‌­‌­కే రా­బో­యే మూడు మెగా ఫై­న­ల్స్‌­‌­‌­‌­‌­‌­‌‌ ఆతి­థ్య హక్కు­ల­ను కే­టా­యిం­చిం­ది. మూడు నెలల క్రి­తం ము­గి­సిన ఏజీ­ఎం­లో ఐసీ­సీ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. 2027, 2029, 2031లో డబ్ల్యూ­టీ­సీ ఫై­న­ల్స్‌­‌­‌­‌­‌­‌­‌‌ జరు­గు­తా­యి. వా­తా­వ­రణ పరి­స్థి­తు­లు అను­కూ­లం­గా ఉం­డ­టం, టె­స్ట్ క్రి­కె­ట్‌­‌­‌­‌­‌­‌­‌­‌­పై ఇం­గ్లం­డ్‌­‌­‌­‌­‌­‌­‌‌ అభి­మా­నుల ఆస­క్తి­ని పరి­గ­ణ­లో­కి తీ­సు­కు­ని ఈ ని­ర్ణ­యం తీ­సు­కు­న్న­ట్లు ఐసీ­సీ తె­లి­పిం­ది. ఇం­డి­యా­లో ఫై­న­ల్స్ ని­ర్వ­హిం­చా­ల­ని బీ­సీ­సీఐ నుం­చి డి­మాం­డ్‌­‌­‌­‌­‌­‌­‌‌ ఉన్న­ప్ప­టి­కీ ఐసీ­సీ ఇం­గ్లం­డ్ బో­ర్డు­కే ఓటు వే­సిం­ది.

3 ఐసీసీ ఈవెంట్లకు భారత్ ఆతిథ్యం

2026లో జర­గ­బో­యే టీ20 వర­ల్డ్‌ కప్‌­కు ఇం­డి­యా, శ్రీ­లంక సం­యు­క్తం­గా ఆతి­థ్యం ఇవ్వ­ను­న్నా­యి. ఈ పొ­ట్టి సమ­రా­ని­కి ఇప్ప­టి­కే 13 జట్లు నే­రు­గా అర్హత సా­ధిం­చ­గా.. యూ­ర­ప్ క్వా­లి­ఫై­య­ర్ ద్వా­రా ఇటలీ, నె­ద­ర్లాం­డ్స్ అర్హత సా­ధిం­చా­యి. దీం­తో టీ20 వర­ల్డ్ కప్ కు అర్హత సా­ధిం­చిన జట్ల సం­ఖ్య 15 కు చే­రిం­ది. 2027 వర­ల్డ్ కప్ లో ఈ సారి మొ­త్తం 14 జట్ల­కు ఐసీ­సీ అవ­కా­శం కల్పిం­చిం­ది. ఈ మెగా టో­ర్నీ 2003 తర­హా­లో జరు­గు­తుం­ద­ని స్ప­ష్టం చే­సిం­ది. మొ­త్తం 14 జట్లు రెం­డు గ్రూ­ప్ లుగా వి­భ­జిం­చ­బ­డ­తా­యి. ఈ మెగా టో­ర్నీ­కి సౌత్ ఆఫ్రి­కా, జిం­బా­బ్వే, నమీ­బి­యా ఆతి­ధ్య­మి­వ్వ­ను­న్నా­యి. హో­స్ట్ కా­బ­ట్టి ఈ జట్లు నే­రు­గా వర­ల్డ్ కప్ కు అర్హత సా­ధి­స్తా­యి.

Tags:    

Similar News