కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు ఘర్షణతో నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ ఆఫీసులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి...వరదలతో ఇళ్లు కోల్పోయిన వారికి సాయం చేయాలని కోరారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్రెడ్డి. అర్హులైన వారికే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే లిస్టులోంచి... బాధితుల పేర్లు తొలగిస్తున్నారంటూ అడ్డుచెప్పారు టీఆర్ఎస్ కార్యకర్తలు. దీంతో ఉత్తమ్ సమక్షంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల బాహాబాహీకి దిగారు....పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.