CM: తల్లిదండ్రులను పట్టించుకోకపోతే ఉద్యోగుల జీతంలో కోత: సీఎం

Update: 2025-10-18 15:37 GMT

ని­స్స­హా­య­కు­ల­కు సహా­యం అం­దిం­చ­డ­మే మన బా­ధ్యత అని అని గ్రూ­ప్‌-2 ఉద్యో­గా­ల­కు ఎం­పి­కైన అభ్య­ర్థు­ల­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి సూ­చిం­చా­రు. ‘‘తల్లి­దం­డ్రు­లు, పు­ట్టి పె­రి­గిన ఊరు­ను అభి­వృ­ద్ధి చే­సు­కో­వ­డం మన బా­ధ్యత.. మీ­రం­ద­రూ అం­కి­త­మ­వు­తా­ర­ని పూ­ర్తి వి­శ్వా­సం ఉంది. ఉద్యో­గా­ర్థు­లు ఎవ­రై­నా తల్లి­దం­డ్రు­ల­ను పట్టిం­చు­కో­క­పో­తే .. మీ జీ­తం­లో 10 నుం­చి 15శాతం కోత వి­ధిం­చి తల్లి­దం­డ్రుల ఖా­తా­లో వే­స్తా. ఒకటో తేదీ మీ జీతం ఎలా వస్తుం­దో.. అలా­గే మీ తల్లి­దం­డ్రుల అకౌం­ట్‌­లో ఒకటో తే­దీన పడు­తుం­ది. దీని కోసం త్వ­ర­లో చట్టం తీ­సు­కొ­స్తాం’’ అని సీఎం అన్నా­రు. హై­ద­రా­బా­ద్‌ శి­ల్ప కళా­వే­ది­క­లో జరి­గిన కా­ర్య­క్ర­మం­లో గ్రూ­ప్‌-2 ఉద్యో­గా­ల­కు ఎం­పి­కైన 783 మంది అభ్య­ర్థు­ల­కు సీఎం, డి­ప్యూ­టీ సీఎం భట్టి వి­క్ర­మా­ర్క, సీ­ఎ­స్‌ రా­మ­కృ­ష్ణా­రా­వు, మం­త్రి పొ­న్నం ప్ర­భా­క­ర్‌.. చే­తుల మీ­దు­గా ని­యా­మక పత్రా­లు అం­ద­జే­శా­రు. ఈ సం­ద­ర్భం­గా సీఎం మా­ట్లా­డా­రు. ‘‘శ్రీ­కాం­తా­చా­రి, వే­ణు­గో­పా­ల్‌­రె­డ్డి, ఈషా­న్‌­రె­డ్డి, యా­ద­య్య లాం­టి యువ వి­ద్యా­ర్థు­లు తమ జీ­వి­తా­ల­ను ధా­ర­పో­సి.. ఆత్మ­బ­లి­దా­నా­ల­తో తె­లం­గాణ రా­ష్ట్రా­న్ని సా­ధిం­చా­రు.

పథ­కా­లు, అభి­వృ­ద్ధి పనుల అమ­ల్లో ని­ర్ల­క్ష్యా­న్ని సహిం­చే­ది లే­ద­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి అన్నా­రు. కొ­త్త ప్ర­భు­త్వం ఏర్పా­టై రెం­డే­ళ్లు గడు­స్తు­న్నా.. కొం­ద­రు అధి­కా­రుల పని­తీ­రు­లో ఇంకా మా­ర్పు రా­లే­ద­ని అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు. సీ­ఎ­స్‌ రా­మ­కృ­ష్ణా­రా­వు, సీ­ఎం­వో కా­ర్య­ద­ర్శు­ల­తో సీఎం సమా­వే­శ­మ­య్యా­రు. కొం­ద­రు ము­ఖ్య కా­ర్య­ద­ర్శు­లు, వి­భా­గా­ధి­ప­తుల పని­తీ­రు­పై అసం­తృ­ప్తి వ్య­క్తం చే­శా­రు.

అధి­కా­రు­లు అల­స­త్వం వీడి అభి­వృ­ద్ధి పను­ల­పై దృ­ష్టి­సా­రిం­చా­ల­ని హి­త­వు పలి­కా­రు. సొంత ని­ర్ణ­యా­ల­తో అధి­కా­రు­లు ప్ర­భు­త్వా­ని­కి చె­డ్డ­పే­రు తీ­సు­కు­రా­వొ­ద్ద­ని సూ­చిం­చా­రు. అన్ని వి­భా­గా­లు సమ­న్వ­యం­తో పని­చే­స్తే­నే పను­లు వే­గ­వం­త­మ­వు­తా­య­ని, ప్ర­జ­ల­కు మేలు జరి­గే ని­ర్ణ­యా­లు, కా­ర్య­క్ర­మా­ల­కు ప్రా­ధా­న్య­మి­వ్వా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. ఎప్ప­టి­క­ప్పు­డు ని­వే­ది­క­లు తె­ప్పిం­చు­కొ­ని, పనుల పు­రో­గ­తి­ని సమీ­క్షిం­చా­ల­న్నా­రు. ‘‘కీలక దస్త్రా­లు, పను­లు ఎక్క­డా ఆగి­పో­వ­డా­ని­కి వీ­ల్లే­దు. కేం­ద్రం నుం­చి గ్రాం­ట్లు, ని­ధు­లు రా­బ­ట్టు­కు­నే కా­ర్యా­చ­ర­ణ­ను వెం­ట­నే చే­ప­ట్టా­లి. ఇకపై సీ­ఎ­స్‌, సీ­ఎం­వో అధి­కా­రు­లు ప్ర­తి­వా­రం ని­వే­ది­క­లు అం­దిం­చా­లి’’ అని ఆదే­శిం­చా­రు.

Tags:    

Similar News