Yadadri Temple : తుదిదశకు చేరుకున్న యాదాద్రి పునర్నిర్మాణ పనులు
Yadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి..;
Yadadri Temple : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.. గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా యాదాద్రి పునర్నిర్మాణ పనులను పరిశీలించారు.. పలు సలహాలు, సూచనలు చేయడంతోపాటు డెడ్లైన్ కూడా విధించారు.. ఈ నేపథ్యంలో మార్చి రెండో వారంలోపు పనులు పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. కొండపై ప్రసాదం క్యూ కాంప్లెక్స్, మౌలిక సదుపాయాల కల్పన అనుకున్న సమయానికి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.