మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించిన సీఎం కేసీఆర్‌

Update: 2020-10-21 14:23 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని పరామర్శించారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌.. నాయిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డాక్టర్లను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. నాయినికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లుకు సూచించారు. అనారోగ్యంతో బాధపడుతున్న నాయిని నర్సింహారెడ్డి... కొంతకాలంగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.


Tags:    

Similar News