METRO: తెలంగాణ ప్రభుత్వం చేతికి మెట్రో తొలి దశ

టేకోవర్ చేసేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధం

Update: 2025-09-26 03:30 GMT

హై­ద­రా­బా­ద్‌ మె­ట్రో మొ­ద­టి దశ ప్రా­జె­క్టు రా­ష్ట్ర ప్ర­భు­త్వం చే­తి­కి రా­నుం­ది. ఈ మే­ర­కు సీఎం రే­వం­త్‌­రె­డ్డి, ఎల్‌ అం­డ్‌ టీ సీ­ఎం­డీ మధ్య అం­గీ­కా­రం కు­ది­రిం­ది. ప్ర­భు­త్వం LTMRHL పూ­ర్తి రు­ణా­న్ని స్వా­ధీ­నం చే­సు­కు­ని, వారి ఈక్వి­టీ వి­లు­వ­కు దా­దా­పు రూ.5900 కో­ట్లు చె­ల్లిం­చ­నుం­ది. ఎల్అం­డ్టీకి ఉన్న రూ.13000 కో­ట్ల అప్పు­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం టే­కో­వ­ర్ చే­సేం­దు­కు సం­సి­ద్ధత వ్య­క్తం చే­సి­న­ట్లు తె­లు­స్తోం­ది.

 మెట్రో నష్టాలు.. ప్రభుత్వమే తేల్చుకోవాలి"

హై­ద­రా­బా­ద్‌-శ్రీ­శై­లం మా­ర్గం­లో 4 లే­న్ల ఎక్స్‌­ప్రె­స్‌ హైవే ని­ర్మా­ణం చే­ప­ట్ట­ను­న్న­ట్లు కేం­ద్ర మం­త్రి కి­ష­న్‌­రె­డ్డి తె­లి­పా­రు. పర్యా­వ­ర­ణా­ని­కి,వన్య­ప్రా­ణు­ల­కు ఎలాం­టి నష్టం లే­కుం­డా హై­వేల ని­ర్మా­ణం చే­ప­డ­తా­మ­న్నా­రు. ది­ల్లీ­లో ఆయన మీ­డి­యా­తో మా­ట్లా­డు­తూ.. శ్రీ­శై­లం ఎలి­వే­టె­డ్‌ కా­రి­డా­ర్‌ ని­ర్మా­ణా­ని­కి కేం­ద్రం ముం­దు­కొ­చ్చిం­ద­ని, దీ­ని­పై త్వ­ర­లో­నే ని­ర్ణ­యం తీ­సు­కుం­టా­మ­ని కేం­ద్ర­మం­త్రి గడ్క­రీ చె­ప్పా­ర­ని అన్నా­రు. ‘‘భూ­సే­క­రణ త్వ­ర­గా పూ­ర్తి­చే­స్తే.. ప్రా­జె­క్టుల ని­ర్మా­ణం త్వ­ర­గా అవు­తుం­ది. మె­ట్రో వి­స్త­ర­ణ­లో సీఎం వ్య­వ­హా­ర­శై­లి సమం­జ­సం­గా లేదు. రా­ష్ట్రా­ని­కి ని­ధు­లు, ప్రా­జె­క్టు­లు రా­వా­ల­ని కో­రు­కు­నే వ్య­క్తు­ల్లో ముం­దుం­టా. ఆర్‌­ఆ­ర్‌­ఆ­ర్‌, మె­ట్రో వి­ష­యం­లో ప్రో­యా­క్టి­వ్‌­గా వ్య­వ­హ­రిం­చాం. హై­ద­రా­బా­ద్‌ మె­ట్రో ఇప్ప­టి­కే నష్టా­ల్లో నడు­స్తోం­ది. మె­ట్రో నష్టా­లు రా­ష్ట్ర ప్ర­భు­త్వ వ్య­వ­హా­రం.. వారే తే­ల్చు­కో­వా­లి. మె­ట్రో­కు అన్ని రకా­లు­గా మా సహ­కా­రం ఉం­టుం­ది. కా­ళే­శ్వ­రం­పై సీ­బీఐ ప్ర­తి­పా­ద­న­లు అం­దా­యని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Tags:    

Similar News