సీఎం కేసీఆర్ పుట్టిన రోజున రంగనాయకసాగర్ నీరు విడుదల చేసిన మంత్రి హరీష్రావు
చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామ పరిధిలోని రంగానాయక సాగర్ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేశారు.;
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గంలో అన్నదాతలకు సాగునీరు అందించారు మంత్రి హరీష్రావు. చిన్నకోడూర్ మండలం చందలపూర్ గ్రామ పరిధిలోని రంగానాయక సాగర్ ద్వారా యాసంగి పంటలకు నీరు విడుదల చేశారు. సీఎం పుట్టిన రోజున ఈ ప్రాంత ప్రజలకు నీరు అందిచడం సంతోషంగా ఉందన్నారు హరీష్రావు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన కేసీఆర్ జన్మధన్యమైందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ సారి 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వచ్చాయన్నారు. ఒకనాడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థుతి నుంచి కేసీఆర్ ముందు చూపుతో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే పరిస్థితి చేరుకున్నామన్నారు హరీష్రావు.